పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నిజామాబాద్లో పర్యటించిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. ఫాంహౌస్లో కూర్చుని తమ ప్రభుత్వంపై కేసీఆర్ కుట్ర చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేస్తున్న పనులు నిజమైతేనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.