హైదరాబాద్లో 28 ఏళ్ల రమ్యశ్రీ అనే గృహిణి బ్రెయిన్డెడ్గా మారినప్పటికీ, ఆమె అవయవ దానం ద్వారా ఆరుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి పునర్జన్మ ప్రసాదించారు. కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కంటి కార్నియాలను దానం చేసి, ఆమె ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపారు. రమ్యశ్రీ త్యాగం అవయవదానం ఆవశ్యకతను మరోసారి గుర్తుచేసింది.