అసెంబ్లీ ఘటనలపై సమగ్ర విచారణకు రేవంత్రెడ్డి సర్కార్ ఆదేశించింది. అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు ఎర్రవల్లి ఫాంహౌస్లోనే కుట్ర జరిగిందని సీఎం సంచలన ఆరోపణలు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై అనుచిత వ్యాఖ్యలు, దళితులను అవమానించే చర్యలను తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని పేర్కొన్నారు. ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వారితో పాటు వెనుక ఉండి నడిపించిన వారిపైనా విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.