బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో వానలు కురవనున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో వచ్చే మూడు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేసింది. మరోవైపు ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితులలో.. వానలు కురుస్తాయన్న వార్తలు రైతులకు ఊరట కలిగిస్తున్నాయి.