తెలంగాణ అసెంబ్లీలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. మార్చి 8వ తేదీన నూతన కౌన్సిల్ హాల్ ప్రారంభించనున్నారు. దీంతోపాటు అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అదే సమయంలో అసెంబ్లీలో సీఎం, మండలి ఛైర్మన్లకు సంబంధించిన కొత్త ఛాంబర్లకు శ్రీకారం చుట్టనున్నారు. ఒకే ప్రాంగణం నుంచి అటు బడ్జెట్ సమావేశాలతోపాటు.. పాలన అందించేందుకు ఈ చర్యలు చేపట్టనున్నారు.