ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వచ్చిన వంగలపూడి అనితకు.. సభలోనే అస్వస్థత పాలయ్యారు. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వంగలపూడి అనితను పరీక్షించిన డాక్టర్లు బీపీ ఎక్కువైనట్లు గుర్తించారు. ఇక తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన పడొద్దని వంగలపూడి అనిత స్పష్టం చేశారు.