శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోని మదనపల్లి తండాలో వందల ఎకరాల అసైన్డ్ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయి. దీంతో రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. దాదాపు 11,200 కోట్ల విలువైన 559 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు.