తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం వేడి పుట్టిస్తోంది. అసెంబ్లీ దీనికి సంబంధించిన బిల్లులను ఆమోదించింది. త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇదిలా ఉంటే..,కేంద్రం ఓబీసీ జాబితాలో 40 కులాలను చేర్చాలంటూ రాష్ట్రం బీస కమిషన్ ఛైర్మన్.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. అలానే రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యం అవుతుందా లేదా అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.