గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాల విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాజేంద్రనగర్లోని ఓ ప్రైవేటు భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవట్లేదని ఓ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ విజయసాయిరెడ్డి.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి అధికారుల ఫోటోలు ట్యాంక్బండ్పై ప్రదర్శించాలని ఘూటు వ్యాఖ్యలు చేశారు.