తెలంగాణ సర్కార్ రోడ్ల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. ఏకంగా రూ.2 వేల కోట్లకు పైగా ఖర్చుతో ఆరు జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లను బాగు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో రహదారులు అభివృద్ధి పనులు జరగనున్నాయి. కాంట్రాక్టర్లు 60 శాతం నిధులు సమకూర్చుకుంటే, ప్రభుత్వం 15 ఏళ్లలో వడ్డీతో సహా చెల్లిస్తుంది. రోడ్ల నిర్వహణ బాధ్యత కూడా 15 సంవత్సరాల పాటు వాళ్లదే. త్వరలోనే ఈ పనులు మొదలవుతాయి.