తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోనుంది. ఇళ్లను అమ్మినా, అద్దెకు ఇచ్చినా POT చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ హెచ్చరించారు. కొల్లూరు, రాంపల్లి వంటి ప్రాంతాల్లో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఇళ్ల అమ్మకాలు జరుగుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.