ఆ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. అదనంగా రూ.10 వేలు, త్వరలోనే ఉత్తర్వులు

7 months ago 8
తెలంగాణలోని మెప్మా ఉద్యోగులకు శుభవార్త. త్వరలోనే అలెవెన్సులతో కూడిన పూర్తి జీతం అందనుంది. ప్రస్తుతం ఇస్తున్న జీతంతో పాటుగా.. రూ.10 వేల అలవెన్సు అదనంగా ఇవ్వనున్నారు. గత ఏడాది ఆగస్టులో సెర్ప్ సిబ్బందితో సమానంగా పూర్తి పేస్కేల్ పొందుతున్న 378 మంది ఉద్యోగులకు.. మే నెల నుంచి తగ్గిపోయిన జీతాలు త్వరలో మళ్లీ పూర్తి స్థాయిలో రానున్నాయి. అలవెన్సుల విషయంలో వచ్చిన సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా.. వారికి తిరిగి రూ.32 వేల వరకు జీతం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
Read Entire Article