First Time Train Came To Punugodu Kanigiri Prakasam District: ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే లైన్ల పనులు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా నడికుడి - శ్రీకాళహస్తి మార్గం అమరావతిని రాయలసీమతో పాటు దక్షిణాది నగరాలకు అనుసంధానం చేయనుంది. విజయవాడ - చెన్నై మార్గానికి ప్రత్యామ్నాయంగా మారే ఈ ప్రాజెక్టులో ప్రకాశం జిల్లాలో పనులు వేగవంతమయ్యాయి. కనిగిరి వరకు రైలు పట్టాలు చేరాయి, త్వరలో ప్రయాణికుల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.