డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అల్లూరి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి వెలుగొచ్చింది. ఇన్నేళ్లూ కరెంట్ వెలుగు చూడని ఆ ఊరు నేడు విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గూడెం గ్రామవాసులు కరెంట్ లేక ఇబ్బందులు పడేవారు. ఐదు నెలల కిందట అల్లూరి జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ వద్ద తమ సమస్యలు చెప్పుకున్నారు. దీంతో గూడెం గ్రామానికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల సాయంతో ఈ ఊరికి కరెంట్ వెలుగులు వచ్చాయి.