పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుపై టీడీపీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. చదలవాడ అరవిందబాబు తీరు మీద టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో చదలవాడ అరవిందబాబును టీడీపీ అధిష్ఠానం వివరణ కోరింది. చదలవాడ తీరును ఆక్షేపించిన టీడీపీ అధిష్టానం.. ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.