Raghu Rama Krishnam Raju Speech In Palnadu District: వైఎస్సార్సీపీకి తాను దూరం కావడానికి గల కారణాలను ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. కోడెల శివప్రసాదరావును విమర్శించిన వారిని వారించడంతోనే జగన్తో విభేదాలు తలెత్తాయని ఆయన తెలిపారు. కోడెల సభను నడిపిన తీరు ఆదర్శనీయమని కొనియాడారు. తన కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితురాలికి జ్ఞాపకశక్తి తిరిగిరావాలని ఆకాంక్షించారు. త్వరలోనే ఈ కేసు పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.