ఆ కథనాలు చూస్తే బాధేస్తోంది.. సజ్జనార్ ఎమోషనల్

3 months ago 20
నేటి ఆన్‌లైన్ యుగంలో.. అమ్మాయిలు మరింత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. అందమైన అబ్బాయిలు, సినీ నటుల ఫోటోలను డీపీలుగా ఉంచుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు.. ఆడపిల్లలను మోసం చేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో తన దృష్టికి ఎక్కువగా వస్తున్నాయని సజ్జనార్ అన్నారు. ఇలాంటి డీపీలతో ఫేక్ ఖాతాల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి.. అమ్మాయిలతో పరిచయమైన తర్వాత వారి ఫోటోలను సేకరిస్తున్నారని.. వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని హెచ్చరించారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని.. అలాగే ఎవరైనా అన్యాయానికి గురైతే ధైర్యంగా సమాచారం అందించాలని సూచించారు.
Read Entire Article