Ys Jagan On Chandrababu Naidu: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుపై 'క్రెడిట్ చోరీ స్కీం' అంటూ తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను కూటమి ప్రభుత్వం తమదిగా చెప్పుకోవడం దారుణమన్నారు. 18 నెలల్లో స్థలం ఇవ్వకుండా, పైసా ఖర్చు చేయకుండా, గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను తమవిగా చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. పేదల ఇళ్ల స్థలాలను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.