AP Cheeramenu Fish Rs 140000: గోదావరిలో అరుదైన చీరమేను చేపలకు భారీ డిమాండ్ ఏర్పడింది. యానాం రేవులో 10 లీటర్ల బకెట్ రూ.14 వేలకు వేలం పలికింది. ఈ చేపల అమ్మకాలు రూ.10 లక్షలు దాటాయి. రుచికరమైన వంటకాలతో నోరూరించే ఈ చేపలు మరో వారం మాత్రమే లభ్యమవుతాయని మత్స్యకారులు చెబుతున్నారు. పులస చేపల తర్వాత చీరమేను సందడి మార్కెట్లో కనిపిస్తోంది. ఈ చీరమేను కోసం జనాలు ఎగబడుతున్నారు.