తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కోసం పంపిన 47 ప్రతిపాదనలు ఇప్పటికీ ఢిల్లీలోనే ఆగిపోయి ఉన్నాయి. మెట్రో రైలు రెండో దశ పనులు ముందుకు సాగాలన్నా.. పేదల ఇళ్ల కోసం పైసలు రావాలన్నా కేంద్రం సంతకం పెట్టాల్సిందే. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ కోసం, మూసీ నది శుభ్రం చేయడానికి వేల కోట్ల నిధులు మంజూరు కావాల్సి ఉంది. అంతే కాకుండా.. ఖమ్మంలో ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ జిల్లాలోని కాకతీయ టెక్స్ టైల్ పార్కు పనులు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. కొత్తగా నవోదయ, కేంద్రీయ స్కూల్స్ ఏర్పాటు చేయాలని అడిగినా ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. వీటిని త్వరగా ఆమోదించాలని ప్రభుత్వం కోరుతోంది.