ఏపీ ప్రభుత్వం కాఫీ రైతులకు శుభవార్త వినిపించింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కాఫీ రైతులకు తీపికబురు వినిపించింది. అల్లూరి జిల్లాలోని గూడెం కొత్తవీధి, జి. మాడుగుల మండలాల్లో ఎకో కాఫీ పల్పింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.7 కోట్లు నిధులు విడుదల చేసింది. దీంతో కాఫీ పల్పింగ్ కేంద్రాల నిర్మాణ పనులు మొదలుపెట్టారు. గూడెం కొత్తవీధిలో మెషీన్ల సాయంతో భూమిని చదును చేస్తున్నారు.