తెలంగాణలో ఈ సంవత్సరం పలు ప్రాంతాల్లో వరి నాట్లు ఆలస్యం అయిన నేపథ్యంలో వరి కోతలపై అధికారులు కీలక అలర్ట్ జారీ చేస్తున్నారు. దీనిలో భాగంగా యాదాద్రి జిల్లా అధికారులు పాల కంకుల దశలోనే వరి కోతలు కోస్తే క్రిమినల్ కేసులు తప్పవని స్పష్టం చేశారు. వర్షాలు ఆలస్యం కావడంతో నాట్లు ఆలస్యమయ్యాయి. తేమ శాతం ఎక్కువగా ఉన్న వడ్లను కొనుగోలు చేయకపోవడం, బహిరంగ మార్కెట్లో ధర తగ్గడం వంటి కారణాలతో ఈ చర్యలు తీసుకుంటున్నారు.