హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ‘ఉత్తర తెలంగాణ కోనసీమ’గా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. డిసెంబర్ 3న సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా పలు కీలక ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. వీటిలో రింగురోడ్డు (Ring Road) నిర్మాణం, స్టేడియం అభివృద్ధి, కబడ్డీ అకాడమీ ఏర్పాటు ప్రధానమైనవి. అలాగే ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు బస్సులు, విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.