తెలంగాణలో రోడ్డు మార్గాల అభివృద్ధిలో భాగంగా, గండి మైసమ్మ నుండి మెదక్ వరకు ఉన్న 675డీ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్న ఈ హైవేని ఫోర్ లేన్గా విస్తరిస్తే.. ఈ మార్గంలో రద్దీ తగ్గడమే కాకుండా ప్రమాదాలు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. అంతేకాకుండా మెదక్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపారు. త్వరలోనే కేంద్రం నుంచి అనుమతులు వస్తాయని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.