ఏపీ ప్రభుత్వం కొత్త రహదారుల నిర్మాణం, పాత రహదారుల మమర్మత్తులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 28 చోట్ల కొత్త రహదారులను నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.63 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశారు. నాబార్డు నిధులతో ఈ రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. మరోవైపు ఇప్పటికే కొన్ని పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించే పనిలో ఉన్నారు.