ఆ జిల్లాకు మహర్దశ.. కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి పొంగులేటి.. దాదాపు రూ.5 వేల కోట్లతో..

6 months ago 13
గ్రేటర్ వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం రూ.5 వేల కోట్లను కేటాయించినట్లు వరంగల్ జిల్లా ఇన్‌చార్జి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి తెలియజేశారు. వీటిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రూ.4100 కేటాయించినట్లు తెలిపారు. త్వరలో వీటి పనులు ప్రారంభిస్తామన్నారు. వరంగల్ కోటలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే వరంగల్‌ ప్రజల చిరకాల కోరికగా ఉన్న మామునూర్ ఎయిర్ పోర్ట్ కలను సాకారం చేయబోతున్నట్లు తెలిపారు.
Read Entire Article