ఉత్తర తెలంగాణ క్రీడాకారుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో జమ్మికుంటలో రూ. 6.5 కోట్లతో అత్యాధునిక సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటుకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. 'ఖేలో ఇండియా' పథకం కింద నిర్మించనున్న ఈ ట్రాక్, గ్రామీణ క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ అవకాశాలను అందించి, ఉత్తర తెలంగాణను క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దనుంది.