తెలంగాణ రాష్ట్రంలో విమానయాన రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే వరంగల్లోని మామునూరు విమానాశ్రయం (Mamunoor Airport)అభివృద్ధికి ముందడుగు పడగా.. తాజాగా ఉత్తర తెలంగాణ ప్రజల కల అయిన ఆదిలాబాద్లో బ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధి కోసం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ 700 ఎకరాల భూమిని సేకరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ను ఆదేశించారు.