ఏపీ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన మీద ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్గా మార్చాలనే ఉద్దేశంతో రహదారులు, విమానాశ్రయాల అభివృద్ధి చేపడుతోంది. ఈ క్రమంలోనే పలుచోట్ల రహదారుల రూపురేఖలు మారుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలోని రెండు ప్రధాన రోడ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. కందుకూరు, కావలి పరిధిలోని రెండు రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. కొన్ని చోట్ల కొత్తగా రోడ్లు నిర్మించనుండగా.. మరికొన్నిచోట్ల విస్తరించనున్నారు.