తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రెండు, మూడు జిల్లాల్లో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేేసేందుకు చర్యలు తీసకుంటుంది. దీనిలో భాగంగా వరంగల్లో మామునూరు వద్ద విమానాశ్రయం ఏర్పాటు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ప్రభుత్వం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేస్తుంది. ఇప్పటికే భూసేకరణ కోసం 250 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.. మరో 90 కోట్ల రూపాయలను కూడా భూసేకరణ కోసమే విడుదల చేయనుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ వివరాలు..