ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లావాసులకు శుభవార్త. మచిలీపట్నంలో షిప్యార్డు ఏర్పాటు కానుంది. ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో గోవా షిప్యార్డు.. మచిలీపట్నంలో షిప్యార్డు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నంలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. 2026లో మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తి చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.