Heavy Rain In Medak District: మెదక్ జిల్లాలోని రామాయంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో భారీ వర్షాల కారణంగా సుమారు 350 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. హాస్టల్ చుట్టూ వరద నీరు చేరడంతో, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు ఆహారం, నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా.. హాస్టల్లోకి పాములు కూడా ప్రవేశించాయని వారు తెలిపారు. చివరికి, పోలీసులు తాడు సాయంతో విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.