జమ్మూ కాశ్మీర్ ఘటనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతో తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి రాష్ట్రంలోని పాకిస్థాన్ జాతీయులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో ఉంటున్న పాకిస్థానీయులంతా వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. దాదాపు 200 మందికి పైగా పాకిస్థానీయులు తెలంగాణలో ఉన్నారని, వారి వీసాలు త్వరలో ముగుస్తాయని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ జితేందర్ రెడ్డి హెచ్చరించారు.