Test Tube Baby Centre: సికింద్రాబాద్లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో దారుణం వెలుగుచూసింది. సంతానం కోసం వచ్చిన దంపతులకు వేరే వ్యక్తి వీర్యంతో ఐవీఎఫ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. డీఎన్ఏ పరీక్షల్లో నిజం తేలడంతో సెంటర్ డాక్టర్తో సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సంతానం కోసం ఎదురుచూసే దంపతులను కలవరానికి గురిచేస్తోంది. ఇలాంటి మోసాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.