Chandrababu adopts bangaru kutumbalu under P4 Model: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పీ4 కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని 250 బంగారు కుటుంబాలను చంద్రబాబు దత్తత తీసుకున్నారు. పీ4 కార్యక్రమంలో తనతో పాటుగా తన కుటుంబసభ్యులు కూడా భాగస్వామ్యులు అవుతారని చంద్రబాబు వెల్లడించారు. పీ4 కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. పీ4 లోగో విడుదల చేశారు. అలాగే ఆగస్ట్ 15వ తేదీ నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు.