తెలంగాణ రైతుల ఆర్థికాభివృద్ధికి పామ్ ఆయిల్ సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వికారాబాద్లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్లో పాల్గొని, స్వయంగా మొక్కలు నాటారు. పామ్ ఆయిల్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుందని, మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటలు వేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో అధికంగా సాగు చేస్తే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించిందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.