ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించే జల జీవన్ మిషన్ గడువును కేంద్రం 2028 వరకు పొడిగించింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న రూ.23 వేల కోట్ల తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరో అవకాశం లభించినట్లైంది. ఈ పనులు పూర్తి చేయడం కోసం ఏపీ రూ.10 వేల కోట్ల రుణం తీసుకుని, కేంద్ర వాటా నిధులను రాబట్టేందుకు చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్లు అందించడమే లక్ష్యం.