Dugarajapatnam Port Land Acquisition Update: ఆంధ్రప్రదేశ్లో మరో పోర్టుకు సంబంధించి లైన్ క్లియర్ అయ్యింది. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న దుగరాజుపట్నం పోర్టుకు సంబంధించిన భూసేకరణకు మార్గం సుగమం అయ్యింది. మొత్తం 2,170.70 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం కూడా బడ్జెట్లో నిధులు కేటాయించడంతో ఇబ్బందులు తొలగిపోయాయి. ఇప్పటికే ఫీజుబులిటీ రిపోర్ట్ కూడా కేంద్రం దగ్గరకు వెళ్లింది. త్వరలోనే పోర్టుకు సంబంధించిన పనులు ప్రారంభం అవుతాయని భావిస్తున్నారు.