వరంగల్ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. మామూనూరు ప్రాంతంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు కానుండటంతో అక్కడ ఉన్నట్లుండి రియల్ భూమ్ వచ్చింది. ఎకరం రెండు కోట్లకు పైగానే పలుకుతోంది. చాలా మంది ఆ ప్రాంతంలో భూములు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే భూములు కోల్పోతున్న రైతులు మాత్రం ఆందోళన చేస్తున్నారు. తమకు పరిహారం రూ. 3 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.