ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోరబండలో జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారాన్ని వేడెక్కించారు. ప్రజలు ఇప్పటికే కారును షెడ్డుకి పంపించారని విమర్శించారు. దివంగత నేత పీజేఆర్ మృతి చెందినప్పుడు.. ఆయన కుటుంబ సభ్యుడికి ఏకగ్రీవంగా స్థానాన్ని ఇవ్వాలని టీడీపీ కూడా మద్దతిచ్చింది. కానీ.. ఆనాడు కేసీఆర్ (KCR) మాత్రం ఆ సంప్రదాయాన్ని విస్మరించి అభ్యర్థిని నిలబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్ను గెలిపిస్తే పీజేఆర్కు గౌరవం దక్కుతుందని తెలిపారు.