పట్టణాలకు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో.. అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాన్ని అమలు చేస్తోంది. తాజాగా తెలంగాణలోని జడ్చర్ల మున్సిపాలిటీని అమృత్ 2.0 పథకం కింద ఎంపిక చేశారు. దీనిలో భాగంగా రానున్న 20 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా మౌలిక సౌకర్యాల కల్పన కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించి, రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్, మురుగునీటి నిర్వహణ వంటి పనులు చేపట్టనున్నారు. దీంతో జడ్చర్ల రూపు రేఖలు మారిపోతాయని స్థానికులు నమ్ముతున్నారు.