మహారాష్ట్ర సరిహద్దు నుండి నిర్మల్ వరకు జాతీయ రహదారి 61 ని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 53 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధి చెందనుండగా, ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ప్రమాదాలు తగ్గి, ప్రయాణం సులభతరం అవుతుంది. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేయడంతో ఈ కల సాకారం కానుంది. ఈ ప్రాజెక్టు 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.