ఆ ప్రాంతాలకు బస్సులు ఎక్కువ నడపండి.. ఆర్టీసీకి పవన్ కళ్యాణ్ సూచనలు

5 months ago 13
కార్తీక మాసం నేపథ్యంలో ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. కాకినాడ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్.. కార్తీక మాసం రద్దీకి తగిన విధంగా ఏర్పాట్లు అవసరమని సూచించారు. ప్రముఖ క్షేత్రాలు అన్నవరం, పాదగయ పిఠాపురం, పంచారామం సామర్లకోటతోపాటు ఇతర ఆలయాల్లో ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. దేవాదాయ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. మరోవైపు భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
Read Entire Article