Free Travel In Metro Express Buses: తెలంగాణ విద్యార్థులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఇకపై బస్ పాస్తో మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. జూన్ 12 నుంచి కొత్త బస్ పాస్ల జారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నిర్ణయంతో ఆర్డినరీ బస్సుల కోసం ఎదురుచూసే బాధ తగ్గుతుంది. అయితే.. బస్ పాస్ ధరలు 20 శాతం పెరిగాయి. ఆర్డినరీ రూ.1400, మెట్రో ఎక్స్ప్రెస్ రూ.1600, మెట్రో డీలక్స్ రూ.1800కు చేరాయి. ఈ కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయి.