Chandrababu Naidu Nda Leaders Teleconference: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు మే 2 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారు. అమరావతి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి గుర్తుగా నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన మాట్లాడారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.