హైదరాబాద్ సమీపంలోని కుంట్లూరులో కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నప్పటికీ.. అక్కడి రైతులు వాటిని అమ్ముకోవడానికి ఆసక్తి చూపడం లేదు. వారసత్వంగా వచ్చిన భూమిని వదులుకోలేక, వ్యవసాయంపై మక్కువతో వరి సాగు చేస్తున్నారు. డబ్బు కళ్ల ముందు కనబడుతున్నా భూమిని అమ్మకుండా.. దానినే నమ్ముకున్న ఆ రైతులను అందరూ ప్రశంసిస్తున్నారు. కోట్లల్లో భూముల ధరలు పరుగెడుతున్నా.. పొట్ట నింపుకోవడానికి వ్యవసాయం చేసేందుకు నడిచి వెళ్తున్న ఆ రైతులకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.