Araku Valley Railway Station Amrit Bharat: అమృత్ భారత్ కింద ఆంధ్రప్రదేశ్లో రైల్వే స్టేషన్ల అభివృద్ధి జోరుగా సాగుతోంది. మారుమూల ప్రాంతాల్లోని స్టేషన్లను కూడా ఆధునీకరిస్తున్నారు. అరకులోయలో రూ.14 కోట్లతో జీప్లస్ టూ అంతస్తుల కొత్త స్టేషన్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. రిక్వెస్ట్ స్టేజీలో రూ.2.5 కోట్లతో శాశ్వత హాల్ట్ నిర్మాణం కూడా వచ్చే వేసవి నాటికి పూర్తవుతుందని అధికారులు ఆశిస్తున్నారు. అరకు ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.