తెలంగాణలో.. వన్యప్రాణుల సంరక్షణ, మౌలిక సదుపాయాలను ప్రాధాన్యం కల్పించాలని రాష్ట్ర వణ్యప్రాణి సంరక్షణ బోర్డు నిర్ణయించింది. సోమవారం (ఫిబ్రవరి 24న) మంత్రి కోండా సురేఖ అధ్యక్షతను తెలంగాణ వన్యప్రాణి సంరక్షణ బోర్డు 8వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బోర్డు పలు కీలక నిర్ణయారలు తీసుకుంది. ఇందులో భాగంగానే.. పోచారం వన్యప్రాణి అభయారణ్యం గుండా వెళ్తున్న మెదక్- ఎల్లారెడ్డి రహదారి విస్తరణకు బోర్డు అనుమతి ఇచ్చింది.