హైదరాబాద్ నగరంలోని డెయిరీ ఉత్పత్తుల్లో పన్నీర్, కోవా ఎక్కువగా కల్తీ అవుతున్నట్లు H-FAST అధికారులు వెల్లడించారు. సరైన లేబులింగ్ లేకుండా డైరీ ఉత్పత్తులను విక్రయించే సరఫరాదారులకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. త్వరలో కొత్త ఎస్వోపీ నిబంధనలను అమల్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఇక మంగళహాట్ ప్రాంతంలో ఆరు నెలలుగా నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే అక్రమ నిల్వ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.