హైదరాబాద్ శివారు బోడుప్పల్లో స్వాతి అనే వివాహితను ఆమె భర్త మహేందర్ రెడ్డి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ.. అనుమానం, గొడవలు కారణంగా ఆమెను చంపి శరీరాన్ని ముక్కలు చేసి మూసీ నదిలో పడేశాడు. పోలీసుల విచారణలో మహేందర్ రెడ్డి నేరం అంగీకరించడంతో అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.